15 June, 2026 | 3:07 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు అందించాలి

27-09-2025 11:35 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దేశం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ జిల్లా వాసి కావడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణ తొలి దశ, మలిదస ఉద్యమాలలో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన పోరాట పటిమ మరువలేనిదని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నియోజకవర్గానికి తొలి శాసనసభ్యులుగా పనిచేశారని, తెలంగాణ సాధనలో ఉద్యమించారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.