27-09-2025 11:58:19 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జడ్పిటిసి, ఎంపీపీ స్థానాలకు లాటరీ ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.