09-10-2025 12:39:38 AM
అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 08: ఎల్బీనగర్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన బి. అనురాధ (ఐపీఎస్) ను సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సామాజిక అంశాలుపై చర్చించారు. అనంతరం డీసీపీ అనురాధ మాట్లాడుతూ.. ప్రధానంగా ఆత్మహత్యాల నివారణ, యువత మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. అలాంటి మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదే విధంగా సమాజ పరిరక్షణలో స్వచ్ఛంద సేవా సంస్థల బాధ్యత ఎంతైనా ఉందన్నారు.