3 July, 2026 | 8:54 PM

Breaking News

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •  

పదిలో మెరిసిన బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

01-05-2025 03:04 PM

100% ఉత్తీర్ణతసాధించిన బాలికల పాఠశాల

హుజురాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదివే బాలికలు 100% ఉత్తీర్ణత సాధించారు. మంతెన వర్షిని 600 మార్కులకు గాను 524 మార్కులు సాధించింది, ఐదుగురు విద్యార్థులు 500 మార్కులు సాధించినారు. వర్షిని తండ్రి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అతడు కట్టే మిషన్ లో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. తన కూతురు పాఠశాల టాపర్గా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు. వర్షినిని ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల పాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ.. ఇంటర్లో బైపీసీ చదివి డాక్టర్ ఐ ప్రజలకు ఉచిత సేవ చేస్తానని తెలిపింది.