17 June, 2026 | 11:02 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

కోలాం ఆదివాసీలకు అండగా ప్రభుత్వం

19-11-2025 12:06 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ

ఉట్నూర్, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి కలలు నిజమవుతున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం లో స్వంతింటి కల ఉంటుందని ఆ కలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరువుగూడలో 53 ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం భూమి పూజ చేశా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ...  ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సారథ్యంలో రాష్ట్రం అనేక సంక్షే మ పథకాలతో అబివృద్ధి చెందుతుందన్నా రు. మీకు ఏదైనా సమస్య ఉంటే నా ఇంటికి వచ్చి అడగండి సమస్యకు పరిష్కారం చేస్తా అని పేర్కొన్నారు. దుష్ప్రచారాలను నమ్మి ధర్నాలు చేస్తూ మోసపోవద్దు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.