16 April, 2026 | 12:30 PM

ముక్కోటి ఏకాదశికి గవర్నర్‌కు ఆహ్వానం

30-12-2025 12:44 AM

యాదగిరిగుట్ట, డిసెంబర్ 29 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నేడు వైభవోపేతముగా నిర్వహింపబడు వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి రావలసిందిగా విష్ణు దేవ్ వర్మను ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు సోమవారం ఆహ్వానించారు.  తదనంతరము దేవస్థాన ప్రధానార్చకులు,అర్చకులు వేద పండితులు  స్వామివారి తీర్థ ప్రసాదములు  గవర్నర్ గారికి అందజేసి ఆశీర్వదించారు.