30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నేడు భూదాన్ పోచంపల్లికి గవర్నర్

12-06-2025 01:45 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ 

యాదాద్రి భువనగిరి జూన్ 11 ( విజయక్రాంతి):  రాష్ట్ర  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. పోచంపల్లి మండలంలోని టూరిజం పార్కులో గవర్నర్  పర్యటన సందర్భంగా  సంబంధిత   అధికారులతో సమీక్షించారు. 

పోలీస్, రెవెన్యూ శాఖ, చేనేత  మరియు జౌళి శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,  ఇ ఇ అర్ అండ్ బి ,  ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ,  ఈ ఈ పంచాయతీ రాజ్, వైద్య శాఖ, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల  పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,  డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఎసిపి, ఏ.డి హ్యాండ్ లూమ్స్ ,పోలీస్ అధికారులు ,సంబంధిత శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.