28-05-2025 07:37:30 PM
అదనపు కలెక్టర్ రాంబాబు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండల పరిధిలో యాసంగి సీజన్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాంటాలు వేసి వెంటనే మిల్లులకు తరలించి 2 రోజులలో కేంద్రాలను క్లోజ్ చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు(Additional Collector Rambabu) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం-1 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన ధాన్యం మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.