30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అండగా నిలవాలి

23-04-2025 01:19 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 22 ( విజయక్రాంతి)ః వలిగొండ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడారు.నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓపిఎంఎస్ లో నమోదు చేస్తూ తక్షణం తరలించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. అకాల వర్షాలు ఉన్నందున రైతులకు ఇబ్బందులు కలగకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరు వెంట ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.