17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలి

03-11-2025 08:09 PM

మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు..

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మర్రిగూడ మండల తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు అన్నారు.. సోమవారం మర్రిగూడ మండల పరిధిలోని శివన్న గూడెం గ్రామంలో రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ (ఎఫ్ఎస్సిఎస్) ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ బాలం నరసింహతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చి వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ శరత్,మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు అరుణ, సుజాత, సంఘం సీఈవో మధు, సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు ఉన్నారు.