10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

యాదవ సంఘ భవనానికి భూమి పూజ

26-07-2025 06:40 PM

రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి నిధులతో 5 లక్షలు మంజూరు..

హర్షం వ్యక్తం చేసిన యాదవ సంఘ సభ్యులు.. 

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో ముస్తాబాద్ మండలం గూడూర్ గ్రామంలో యాదవ సంఘ భవనానికి సంఘం సభ్యులు భూమి పూజ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు యాదవ సంఘానికి మంజూరు చేసినట్లు సంఘ నాయకులు తెలిపారు. సంఘ భవనానికి నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి, సహకరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ చీటి వెంకటనర్సింగ రావు,పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తాటాకర్ల ప్రభాకర్. కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, గ్రామ మాజీ ఉపసర్పంచ్  మందాటి పద్మ నాంపల్లి, యాదవ సంఘం అధ్యక్షుడు  జాంపెల్లి వెంకటేష్, ఉపాధ్యక్షుడు దేవేందర్, కోశాధికారి మహేందర్, యాదవ సంఘ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.