08-07-2025 01:49:29 AM
మంత్రి భట్టి సానుకూల స్పందనతో గన్నేరువరం నేతల్లో ఆనందం
గన్నేరువరం, జూలై 7 (విజయక్రాంతి): మం డలం గుండ్లపల్లి నుంచి పొత్తూరు మార్గంలో డబుల్ రోడ్డ్ ప నుల నిలిపివేతకు కారమమైన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిమల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చా రు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్యంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయ కులతో సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో భట్టిని కలిసినప్పుడు ఈ మేరకు ఆయన స్పష్టమైన హామీ ఇ చ్చారు.
రూ.71 కోట్లలో చేపట్టిన గుండ్లపల్లి-పొత్తూరు మార్గం లో చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు బిల్లులు మం జూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేయడంతో రో డ్డు పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని, దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, మరీ ము ఖ్యంగా వర్షాకాలంలో మరింత అవస్థలు పడాల్సి వస్తున్నదని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
ముందుగా కాం ట్రాక్టర్ కు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క పెండింగ్ బిల్లుల విషయమై శాఖ అధికారులతో మాట్లాడి ఆ బిల్లుల చెల్లింపులు చేపట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.ఈ విషయంలో ప్రతి పక్షాల అన వసర ఆందోళనలతో ఆ ప్రాంత ప్రజలు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లుల చెల్లింపులు చే పడుతున్నందున పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మల్యే డాక్టర్ కవ్వంపల్లిని ఆదేశించారు.
భట్టిని కలిసిన బృందంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లితోపాటు గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు అ ల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అలువాల కోటి, జువ్వాడి మన్మోహన్ రావు, చింతల శ్రీధర్ రెడ్డి, బొడ్డు సుని ల్, సంగు వేణు, బద్దం సంపత్ రెడ్డి, దుండు మల్లేశం, చింతలపల్లి నర్సింహారెడ్డి, బూర వెంకటేశ్, మాతంగి అనిల్, వరుకోలు వెంకట్, డాక్టర్ నర్సయ్య, తిరుపతిగౌడ్ తదితరులుఉన్నారు.