17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హస్తం గుర్తు.. పతంగి పార్టీ మనిషి

05-11-2025 01:30 AM

-మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుంది

-జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికలో హ స్తం గుర్తుతో పతంగి పార్టీ మనిషి పోటీ చేస్తున్నాడని, మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాం గ్రెస్ అద్దెకు తెచ్చుకున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్య ర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భా రీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకాంత్ పా ర్కు వద్ద జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. “నవంబర్ 11న జరిగే ఈ ఎన్నికలు హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

జూబ్లీహి ల్స్‌లో హస్తం పార్టీ వెనుక పతంగి పార్టీ ఉంది. మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీ అద్దెకు తెచ్చుకుంది. 2014లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన వ్యక్తినే రేవంత్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును మజ్లిస్‌కు కట్టబెట్టాలనే ఒప్పందంతోనే ఈ దోస్తానా నడు స్తోంది” అని సంచలన ఆరోపణలు చేశారు. “పదేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ మ జ్లిస్ అడుగులకు మడుగులొత్తింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో నడుస్తోంది” అని విమర్శించారు.

300 మందికి పైగా హిందువులను హత్య చేసిన చరిత్ర మజ్లిస్ పార్టీదని, ఆ పార్టీతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేతులు కలిపాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చినవి గ్యారంటీలు కావు, అవి 420 సబ్‌గ్యారంటీలని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని మ ళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ మూడు కుటుం బ పార్టీలు తెలంగాణకు పట్టిన శని అని తీ వ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జూబ్లీహిల్స్‌లో 10 ఏళ్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ఎలాం టి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. రోడ్లు గుంతలమయంగా, డ్రైనేజీలు పొంగిపొర్లు తూ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తామని చెప్పి, చెత్తకూపంగా మా ర్చారని మండిప్డారు. ఈ దుస్థితి మారాలం టే, అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పా లన అందించే బీజేపీ అధికారంలోకి రావాలని, జూబ్లీహిల్స్‌లో ప్రజల కోసం పనిచేసే దీపక్‌రెడ్డిని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.