28-07-2025 08:04:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న వేధింపులను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లాలో ఆర్ఎంపీలు నిరసన తెలిపారు. నిర్మల్ భైంసా ఖానాపూర్ పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో నిరసన తెలిపిన ఆర్ఎంపీలు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఆర్ఎంపి వైద్యుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు