calender_icon.png 19 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు ఆరోగ్య శిబిరం

18-10-2025 12:00:00 AM

హెల్త్ చెక్‌అప్ ప్యాకేజీలపై రాయితీ ఇచ్చిన విజయ డయాగ్నస్టిక్  

హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ (జనరల్) సెక్రటరీ శ్రీవత్స కోట ఉద్యోగులకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 మందికిపైగా ఉద్యోగులు ఆరోగ్య, కంటి, దంత పరీక్షలు చేయించుకున్నారు. విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ఈ శిబిరం సందర్భంగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు సమగ్ర హెల్త్ చెక్‌అప్ ప్యాకేజీలపై 50% నుంచి 65% వరకు రాయితీను అందించింది. ఈ వైద్య శిబిరానికి ఉద్యోగుల నుంచి విశేషమైన స్పందన లభించింది.   ఉద్యోగుల ఆరోగ్య అవగాహన మరియు శ్రేయస్సు పెంపొందించడంలో చేసిన కృషికి విస్తృతంగా ప్రశంసలు పొందింది.