4 July, 2026 | 10:50 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సనత్‌నగర్‌లో వర్షం – వేదనగా మారిన వర్షపు సంతోషం

19-07-2025 12:14 AM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఈ రోజు సాయంత్రం సనత్‌నగర్‌లో కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచినా, కొన్ని నిమిషాలకే అది స్థానిక ప్రజలకి పెద్ద వేదనగా మారింది. ప్రధాన రహదారులు, లోపలి కాలనీలు అన్నీ వర్షపు నీరు, మురుగు నీటితో నిండి పోయాయి. ప్రజలు గడ్డి నీటిలో నడవాల్సి వచ్చింది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది  మురుగు నీరు మాన్హోల్స్ నుంచి ఉప్పొంగిపోవడం స్పష్టంగా కనిపించింది. ఎటు చూసినా చెత్త, నీటి మేళం. ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వాహనదారులకు తలనొప్పి ద్విచక్రవాహనదారులు నీటిలో జారి పడే ప్రమాదం, ఆటో రిక్షాలు నిలిచిపోవడం, నాలాలపై నీరు పొంగడం వంటివి తరచుగా చోటు చేసుకున్నాయి.

ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడం లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వర్షపు నీరు మరియు మురుగు నీరు కలిసిపోయి లోపలికి వచ్చాయి. ప్రజలు తలుపులు మూసుకొని గదుల్లోకి పరిమితమయ్యారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందన లేకపోవడం  వర్షం పడుతున్న సమయంలో ఎలాంటి మున్సిపల్ ఉద్యోగుల్ని లేకపోవడం, ఎమర్జెన్సీ టీమ్స్ రంగప్రవేశం చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇదే తరహా పరిస్థితి గతంలోనూ ఏర్పడినా, ఇప్పటికీ పరిష్కారమవకపోవడం బాధాకరం.కాలువలను శుభ్రపరచాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలి.ప్రత్యేకంగా వర్షాకాల యాక్షన్ టీమ్‌ను నియమించాలి.ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే వర్షం కురుస్తోంది – కానీ సదుపాయాలు ‘బెట్టర్లపై నీటిలా’ పోతున్నాయి.