19-07-2025 12:14:50 AM
కాగజ్నగర్, జులై 18(విజయక్రాంతి): కాగజ్నగర్ మండలంలోని భట్టుపల్లి దహెగం రహదారిపై శుక్రవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీడిచేను పాఠశాలకు వెళ్లి రహదారి అధ్వానంగా మారింది. కనీసం మర్మతులు చేయడం లేదని పలు మార్లు విన్న విచుకున్న పట్టించువకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మర్మతులు చేసేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదు అంటూ రోడ్డు పై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు రోడ్డును సందర్శించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.