17-08-2025 10:11:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలోని కదిలే గ్రామ శివారులో గల శ్రీ నంది పాదం ఆలయంలో ఆదివారం సినీ హీరో ప్రవీణ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు కోరిపెల్లి వెంకట అర్జున్ రెడ్డి గారు పూజలు చేయించి శాలువాతో సన్మానం చేసారు ఈ కార్యక్రమంలో కోరిపల్లి శ్రీకర్ రెడ్డి పుండ్రురంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.