21 April, 2026 | 11:22 AM

అమెరికా-ఇరాన్ చర్చలపై హైడ్రామా

21-04-2026 09:33 AM
  1. అమెరికా-ఇరాన్ చర్చలపై లేని స్పష్టత
  2. వాన్స్ బృందాన్ని పాకిస్థాన్ కు పంపిన ట్రంప్
  3. తమకు ఎలాంటి ప్రణాళికలు లేవన్న ఇరాన్
  4. ఇరాన్ పై బాంబులేస్తామన్న అమెరికా అధ్యక్షుడు
  5. అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్(Islamabad Talks) చర్చలపై స్పష్టత రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. ట్రంప్ వాన్స్ బృందాన్ని పాకిస్థాన్ కు పంపాడు. చర్చలపై తమకు ఎలాంటి ప్రణాళికలు లేవని ఇరాన్ తెలిపింది. ఇస్లామాబాద్ చర్చలకు తాము వెళ్లబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ తో ఒప్పందం కుదర్చుకునే విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధిలో(Strait of Hormuz) అమెరికా దిగ్బంధం తొలగితేనే చర్చలు జరుపుతామని టెహ్రాన్ తేల్చిచెప్పింది. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ పై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్(US-Iran) కాల్పుల విరమణ ఒప్పందం గడువు రేపటితో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా కొనసాగుతోంది.