17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించే పరిస్థితి లేదు

18-12-2025 12:53 AM

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్  

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) :  పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించే పరిస్థితి లేకుండా పోయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల అవసరాలు, రైతులు, మహిళలు, యువత ఉద్యోగాలపై చర్చ చేయడం లేదని విమర్శించారు. స్వాతంత్య్రం కోసం ఆస్తి, ప్రాణాలు ధారదత్తం చేసిన నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌గా బీజేపీ పని చేస్తోందని మండిపడ్డారు.

బుధవారం ఆయన గాంధీభవన్‌లో ఆ పార్టీ నేత గజ్జి భాస్కర్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడా రు. పార్లమెంట్‌లో జరిగిన  వందేమాతరంపై చర్చలో ప్రియాంక గాంధీ దీటుగా సమాధానమిచ్చారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మొదటగా నెహ్రూపై విమర్శలు చేసిన బీజేపీ, ఇప్పుడు మహాత్మాగాంధీ వరకు వచ్చారని తెలిపారు.    నెహ్రూ, గాంధీలపై మోదీ కుట్రలకు నిరసనగా సంగారెడ్డిలో లక్షలాది మందితో భారీ సభను పెట్టబో తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.