26-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్లోని కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్లో జనరల్ మేనేజర్, సర్కిల్ హెడ్ కళ్యాణ్ ముఖర్జీ అధ్యక్షతన గురువారం హిందీ దివస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం, ఎన్ఎండీసీ లిమిటెడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (అధికారిక భాష) రుద్రనాథ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కె సత్యనారాయణ రాజు నుండి హిందీ దివస్ సందేశాలను చదివారు. ఈ కార్యక్రమంలో పాట ల పోటీ కూడా నిర్వహించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ రుద్రనాథ్ మిశ్రా అధికారిక భాష హిందీ అమలు యొక్క ముఖ్య అంశాలను చర్చించారు. కెనరా బ్యాంక్ అధికారిక భాష అమ లును కూడా ఆయన ప్రశంసించారు.
జనరల్ మేనేజర్ కళ్యాణ్ ముఖర్జీ తన ముఖ్యోపన్యాసంలో హిందీతో పాటు ఒకరి మాతృభాష మరియు ప్రాంతీయ భాషను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. హిందీ పక్షం రోజులలో జరిగిన వివిధ పోటీలలో విజేతలకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుప్రి య మైత్ర అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.