17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హమ్మయ్య..మిస్‌వరల్డ్ ఆగలే

11-05-2025 01:04 AM

భారత్- పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. యుద్ధం వస్తే ఎప్పుడూ ఏ ఒక్క దేశమో బాధితురాలిగా మిగలదని ఆ ప్రభావం ఎదుటి దేశం మీదా ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానించే తీరుగానే మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఆగిపోయాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీల పరిస్థితి ఏంటనీ అంతా అయోమయంలో ఉండిపోయారు. యుద్ధపరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రారంభ వేడుకలకు హాజరుకావద్దని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించుకున్నారు.

అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించడంతో మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇక యుద్ధవాతావరణమే లేకుండా పోవడంతో ఈ పోటీలకు దూరంగా ఉండాలనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మొత్తానికి మిస్‌వరల్డ్ పోటీలు ఆగలేదని సౌందర్య పోషకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.