17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

15-11-2025 06:17 PM

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట గ్రామం గంపోనిపల్లిపల్లెలో శనివారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. గంపోనిపల్లె గ్రామానికి చెందిన గంప వరలక్ష్మి ఇల్లు అగ్నిప్రమాదానికి గురై దగ్దమైంది. వరలక్ష్మి కూలీ పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. కూలీ పనులకు వెళ్తున్న రైతులు ఇది గమనించి మంటలను ఆర్పినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలకు ఇల్లు పూర్తిగా దగ్దమైంది.

నిరుపేద కుటుంబానికి చెందిన వరలక్ష్మి కూలి చేసి జీవనం సాగిస్తుండగా, భర్త లేని పరిస్థితిలో ఇద్దరు చిన్న పిల్లలను ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తూ జీవిస్తోంది. ఇంట్లో ఉన్న బీరువా, బట్టలు, కమల గుడిసెలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన గంప వరలక్ష్మికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బాధితురాలు, గ్రామస్తులు కోరారు.