10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఆరోగ్య సమస్యలపై ఇంటింటి సర్వే

09-09-2025 12:10 AM

వెంకటాపురం(నూగూరు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిరలో  సోమవారం నా అధికారుల ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది.  ఒక్కొక్క ఆశా కార్యకర్త 20 ఇళ్లను సందర్శించాలని మాతా శిశు సంరక్షణ వైద్య అధికారి డాక్టర్ భాస్కర్ గారు ఆశా కార్యకర్తలకు తెలియపరచడం జరిగింది.

సర్వేలో భాగంగా ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య అడిగి తెలుసుకోవాలని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిందే తాగాలని, వేడి ఆహారమే భుజించాలని వైద్య శిబిరంలో వైద్యాధికారి గ్రామస్తులకు సూచించారు.

మొదటిగా శాంతినగర్ గ్రామంలో, ఎస్సీ మరి గూడెం లో వైద్య శిబిరం నిర్వర్తించడం జరిగింది. పరీక్షించుకున్న వారు గర్భవతులు ఆరు, బాలింతలు ఇద్దరు, మధుమేహం, రక్తపోటు వారికి మందులు అందజేయడం జరిగింది. శిబిరం వద్ద  49 మంది పరీక్షించుకున్నారు.