10 April, 2026 | 4:43 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

పంచవటిలో భారీ అక్రమం..

02-11-2025 08:57 PM

* అధికారుల ఉత్తర్వులు బేఖాతరు

* ప్రముఖ హీరో పేరుపై ఆరోపణలు

* విషయం హైకోర్టుకు చేరినా ఆగని పనులు

మ‌ణికొండ‌ (విజ‌య‌క్రాంతి): మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవతి కాలనీలో ఒక భారీ అక్రమ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ కట్టడంపై టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖలు ఆపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, నిర్మాణదారులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. స్థానికుల అభ్యంతరాలను, అధికారుల ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణం సాగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పంచవతి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతోందని కాలనీ వాసులు మున్సిపాలిటీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ టౌనప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని నోటీసులు జారీ చేశారు.

అయినా ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టి పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వెనుక ఒక ప్రముఖ హీరో పేరు ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన పేరును అడ్డుపెట్టుకొని ఈ భారీ కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు సభ్యులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి న్యాయస్థానంలో కేసు దాఖలు కావడం అంశం తీవ్రతను తెలియజేస్తోంది. ఉన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా, శాఖాపరమైన ఆదేశాలు ఉన్నా నిర్మాణం ఆగకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం అండదండలతోనే ఈ అక్రమం సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పంచవతి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.