10 April, 2026 | 2:41 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

శ్రీరామ్ నగర్‌కు వైద్య భరోసా

02-11-2025 08:49 PM

* ఏఎం క్యూర్ ఆసుపత్రి ఉచిత శిబిరం

* పుప్పాలగూడలో నిర్వహణ

* పరీక్షలకు భారీ స్పందన

* పాల్గొన్న పలువురు ప్రముఖులు

మణికొండ (విజ‌య‌క్రాంతి): మణికొండ ఏఎం క్యూర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పుప్పాలగూడలోని శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌లో ఉచిత ఆరోగ్య తనిఖీ శిబిరం నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య ఈ శిబిరానికి నేతృత్వం వహించారు.ఈ శిబిరంలో మధుమేహం, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు, రెటీనా చెకప్, జనరల్ డాక్టర్ కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి స్థానికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమానికి మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మణికొండ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ అర్వపల్లి వంశీ, కస్తూరి రాములు హాజరయ్యారు. వారితో పాటు శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, కాంతారావు, డాక్టర్ ప్రభావతి, డబ్ల్యూఆర్4 గ్రూప్ ప్రెసిడెంట్ సీతారాం దాస్ పాల్గొన్నారు.నివాసితులకు విలువైన వైద్య సేవలు అందించినందుకు డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బృందాన్ని వారు అభినందించారు. శిబిరానికి మద్దతు తెలిపిన వాలంటీర్లకు, పాల్గొన్నవారికి ఏఎం క్యూర్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మణికొండలో ఇలాంటి కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.