17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భారీగా దేశీదారు స్వాధీనం

02-07-2025 01:20 AM

కాగజ్‌నగర్, జూలై౧ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి భారీగా దేశీదారు(మద్యం సీసా లు) ఎక్సైజ్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఎక్సైజ్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సంచారం మేరకు కాగజ్‌నగర్‌లోని చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేయగా కారులో మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేసు న్న 17 దేశీదారు  కార్టూన్లు లభించినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.70వేల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. కారుతోపాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. దేశీదారు అక్రమ రవాణా, విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎస్సై పి.లోభానంద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.