20 June, 2026 | 8:41 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

భారీ స్కోరు దిశగా హైదరాబాద్

27-10-2024 12:00 AM

తన్మయ్ అజేయ సెంచరీ

హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా రెండు వరుస పరాజయాలతో డీలా పడిన హైదరాబాద్ సొంతగడ్డపై మాత్రం చెలరేగింది. ఎలైట్ గ్రూప్-బిలో పాండిచ్చేరితో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (152 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. రోహిత్ రాయుడు (62 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.

మరో ఓపెనర్ అభిరత్ రెడ్డి (68) అర్థశతకం సాధించాడు. మిగిలిన మ్యాచ్‌ల విషయానికి వస్తే.. గ్రూప్-ఏలో బరోడాతో మ్యాచ్‌లో ఒడిశా 193 ఆలౌట్ కాగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలిరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. గ్రూప్-బిలో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. గ్రూప్-ఏలో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు 71 పరుగులకే కుప్పకూలింది. నబీ, యుద్వీర్ సింగ్ చెరో 5 వికెట్లు పడగొట్టారు.