24 March, 2026 | 7:45 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్   •  

పాకిస్థాన్‌దే టెస్టు సిరీస్

27-10-2024 12:00 AM

మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి

రావల్పిండి: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘణ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది.

నొమన్ అలీ 6 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.2021 తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే కాగా.. 2015 తర్వాత ఇంగ్లండ్‌పై పాక్ టెస్టు సిరీస్ నెగ్గడం విశేషం. ఇక తొలి టెస్టులో ఓడి ఆపై సిరీస్‌ను సొంతం చేసుకోవడం పాకిస్థాన్‌కు 1995 తర్వాత ఇదే కావడం గమనార్హం.