08-07-2025 01:38:23 AM
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్,జులై7:(విజయ క్రాంతి) ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సోమవారం 31 మంది లబ్ధిదారులకు7, 88, 500 విలువ గల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆపద వచ్చి ప్రజలుతన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన వారికి సహాయం చేయడానికి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ మార్చకుండా కొనసాగించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని అన్నారు. కాలేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో. హుజరాబాద్ మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి- సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి నవీన్, సేనా రెడ్డి, కృష్ణ ప్రసాద్, రవీందర్ రెడ్డి,పాల్గొన్నారు.