9 April, 2026 | 10:25 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఆ ట్రోఫీలు నేనే గెలిపించా

27-11-2025 12:00 AM

గుహావటి, నవంబర్ 26 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. గుహావటి టెస్ట్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా మీ భవిష్యత్తు ఏంటి అని విలేఖరులు ప్రశ్నించగా దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇక్కడ వ్యక్తుల కంటే క్రికెట్టే ముఖ్యమన్నాడు.

తాను ముందు నుంచీ ఇదే మాట చెబుతున్నానంటూ గుర్తు చేశాడు.తనను కోచ్‌గా ఉంచాలా..వద్దా అన్న దానిపై బోర్డు డిసైడ్ చేస్తుందన్నాడు. తన నిర్ణయాలతోనే భారత్ ఆటతీరు అధ్వాన్నంగా తయారైందన్న విమర్శలకు గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. తన ఆధ్వర్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ గెలిచామంటూ చెప్పుకొచ్చాడు.