17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి

19-11-2025 12:23 AM

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహ కుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయా లంటూ నిర్మాత సీ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలు మంగళవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్ మాట్లాడుతూ.. “నేను తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీగా ఉన్నప్పుడే యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటు చేశాం. కొందరు విశ్రాంత పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.

హాలీవుడ్ సినిమాల పైరసీని అరికట్టాం. తెలుగు ఫిల్మ్ చాంబర్ కృషిని స్కాట్లాండ్ పోలీసులు గుర్తించి, ప్రశంసించారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారు. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ చాంబర్ ఒక్కటే. ఎంతగానో శ్రమించి ఐబొమ్మ రవిని పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు. రాష్ర్ట ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలి.

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని ఎన్‌కౌంటర్ చేయాలి. కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నా. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారు” అన్నారు. వల్లభనేని అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. “సిని మాలు ప్రస్తుతం విజయం సాధించ లేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం సినీ పరిశ్రమకు వరం.

పైరసీని పూర్తిగా అరికడి తేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు. కుటుంబంతో సహా థియేటర్‌కు వచ్చేలా టికెట్ ధరలు ఉండేలా చూడాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భరత్ భూషణ్, వీరశంకర్, చదలవాడ శ్రీనివాసరావు, ముత్యాల రామప్రసాద్, ప్రసన్నకుమార్, అమ్మి రాజు, బాపిరాజు తదితరులు మాట్లాడారు.