13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బంగ్లాదేశ్‌కు ఐసీసీ బృందం

17-01-2026 04:19 AM
  1. చివరి ప్రయత్నంగా చర్చలు

అనంతరం తుది నిర్ణయం 

దుబాయి, జనవరి 16: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరినా బంగ్లా బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగనుంది.

చివరి ప్రయత్నింగా ఇద్దరు సీనియర్ ప్రతినిధులను బంగ్లాదేశ్ బోర్డు సభ్యు లతో చర్చించేందుకు పంపించనుంది.ఇద్దరు సీనియర్ ప్రతినిధులను ఆ దేశానికి పంపి.. వారికి భరోసా కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను తాము వేరుగా చూడబోమనే నమ్మకాన్ని వారికి కలిగించి.. భారత్‌లో వరల్డ్‌కప్ ఆడేందుకు ఒప్పించనుంది.బంగ్లాదేశ్‌లో ఈమధ్య హిందువుల హత్య ప్రభావం టీ20 ప్రపంచకప్పుపై పడింది. ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొ నడంపై విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరకు ముస్తాఫిజుర్‌పై వేటు పడింది. 

దీంతో బంగ్లా బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది. ఇదే కారణంతో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. అప్పటినుంచి బంగ్లా జట్లు మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఇండియాలో కాకుండా ఎక్కడమైనా తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఐసీసీతో  బంగ్లా బోర్డు స్పష్టం చేసింది.