31 May, 2026 | 8:31 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలుకే

17-12-2025 01:47 AM
  1. ఆస్తులు లాక్కుని గెంటేస్తే ఊరుకోం

హైదరాబాద్ సీపీ సజ్జనార్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కనిపెంచిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలే.. ఆస్తులు రాయించుకుని వారిని రోడ్డున పడేస్తున్నారని, వృద్ధాప్యంలో వారికి అండగా ఉం డాల్సింది పోయి అనాథలుగా మారుస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో తన వద్దకు వస్తున్న వృద్ధుల ఫిర్యాదులను చూసి ఆయన చలించిపోయారు.సీపీ మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా చాలామంది వృద్ధులు ఫిర్యాదులతో నన్ను కలుస్తున్నారు.

ఆస్తులన్నీ రాయించుకు ని తమను చిన్న గదిలో బంధించారని, లేదా రోడ్డుపై వదిలేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. రోజు గడవడమే కష్టంగా మారిందని, తమను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని వేడుకుంటున్నారు.ఈ కేసులు చూస్తుం టే చాలా బాధ కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని సీపీ హితవు పలికారు. 

‘ఈ రోజు మీరు యవ్వనంలో ఉండి తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నారేమో.. కానీ, రేపు మీరు కూడా వృద్ధులు అవుతారు. అప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారు. ఆ రోజు బాధపడినా ప్రయోజనం ఉండదు’ అని హెచ్చరించారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం బాధ్యత విస్మరించిన పిల్లలపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.