15 June, 2026 | 2:44 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కాంగోలో.. కూలిన బొగ్గు గని

01-02-2026 01:33 AM

200 మంది కార్మికుల మృతి

కాంగో, జనవరి 31 : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలోని రుబాయాలో ఉన్న ఒక భారీ కోల్టాన్ గని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారు 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గని వద్ద ప్రస్తుతం  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్లో ఉన్న రుబాయా కొల్టాన్ గని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది.

అయితే, ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు ఈ గని ఒక్కసారిగా కుప్పకూలింది. గనిలో పని చేస్తున్న కార్మికులతో పాటు, అక్కడ వ్యాపారం చేసుకునే మహిళలు, చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదంలో మరణించారని స్థానిక గవర్నర్ ప్రతినిధి లుముంబా కాంబెరే ముయిసా ధృవీకరించారు. వర్షాల వల్ల భూమి మెత్తబడటంతో కొండచరియలు విరిగిపడి కార్మికులు ఉన్న లోతైన గుంతలను కప్పేశాయి. సుమారు 200 మందికి పైగా సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.