17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆదర్శ పాఠశాలలో గణిత ప్రయోగశాల ప్రారంభోత్సవం

23-12-2025 12:08 AM

భీమదేవరపల్లి ,డిసెంబర్ 22 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిమండలంలోని ముల్కనూరులో గల ఆదర్శ పాఠశాలలో డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆదర్శ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన గణిత ప్రయోగశాలను మండల విద్యాధికారి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా గణిత ప్రయోగశాలలో గణితానికి సంబంధించిన వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ మరియు పజిల్స్ విద్యార్థులు ప్రదర్శించారు.

ఇందులో భాగంగా విద్యార్థులు ట్రెజర్ హంట్, గణిత గుర్తుల తో తయారు చేసిన రంగోలి ఆకట్టుకొన్నాయి. అలాగే రామానుజన్ సంఖ్య 1729 ను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ రెహమాన్ గారు మాట్లాడుతూ నిజజీవితంలో గణిత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశంలో గణిత ఉపాధ్యాయులు ఆచరిత, రవీందర్ రెడ్డి, వెంకట్, ఇతర ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొన్నారు.