6 April, 2026 | 4:29 PM

Breaking News

ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •   ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్   •  

ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు

08-01-2026 12:42 AM

మోదీకి ఫోన్ చేసిన ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు

న్యూఢిల్లీ, జనవరి 7: ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు బుధవారం ప్రధాని మోదీకి ఫోన్‌చేసి గాజా శాంతి ప్రణాళిక అమలుపై తాజా పరిణామాలను వివరించా రు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలు పుకుంటూ, ఇరు దేశాల మధ్య శాంతి, శ్రేయ స్సు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్‌కు భారతదేశం స్థిరమైన మద్దతు ఉంటుం దని మోదీ పునరుద్ఘాటించారు.

ఈ చర్చలతో ఉగ్రవాదంపై పోరాటంలో ఇరుదేశా లు తమ ఉమ్మడి సంకల్పా న్ని మరోసారి స్పష్టం చేశాయి. ఏ రూపంలో ఉన్నా సరే ఉగ్రవాదాన్ని సహించబోమని (జీరో టాలరెన్స్), ఈ ముప్పును ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో కలిసి పనిచేస్తామని ఇద్దరు ప్రతిజ్ఞ చేశారు. కేవలం భద్రతా పరమైన అంశాలే కాకుండా, పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన భారత్- జ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రా బోయే కాలంలో మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఈ చర్చల అనంతరం మోదీ ఎక్స్‌లో బుధవారం పోస్టు చేస్తూ ద్వారా మిత్రుడు బెంజిమిన్ నేతన్యాహుతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.