24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

17-11-2025 06:18 PM

ఎంపీడీవో జలంధర్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో జలంధర్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నియమావళిని తప్పనిసరిగా అనుసరించాలని, ప్రతి వారము నిర్మాణ పురోగతిపై నివేదికను సమర్పించాలని అన్నారు. ఎటువంటి అవకతవకలు ఉన్నా, తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు.