17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

18-12-2025 12:31 AM

బూర్గంపాడు,డిసెంబర్ 17,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో అర్హత ఉన్న ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని సర్పంచ్ వర్స మంగమ్మ హామీ ఇచ్చారు. బుధవారం ఉప్పుసాకలో లబ్ధిదారులు కొర్స గాంధీ, గుగులోత్ నాగేశ్వరరావుల గృహ నిర్మాణ స్లాబ్ పనులకు ఆమె కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

వార్డు సభ్యులు, కాంగ్రెస్ నేతలతో కలిసి లబ్ధిదారులను అభినందించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కందుల రాంబాబు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,చంటి, కొర్సా వెంకటేష్, ముర్రం రాంబాబుతదితరులు పాల్గొన్నారు.