calender_icon.png 30 September, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాల్కల్ పాఠశాలలో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన

30-09-2025 12:00:00 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల న్యాల్కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్ర సందర్భంగా సరస్వతి దేవి మాత విగ్రహ స్థాపన చేశారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి గేమ్సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు భక్తి భావన పెంపొందించుకోవాలన్నారు పాఠశాలలో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఎల్ కిరణ్ కుమార్. భోజనం ప్రధానోపాధ్యాయులు కొత్తూరు దేవదాస్ గ్రామ సచివాలయ కార్యదర్శి మల్లేశం విగ్రహ దాత గంగమని దంపతులు వీడిసి చైర్మన్ కిరణ్ గ్రామ పెద్దలు శ్రీధర్ ఏ ఏపిసి చైర్మన్ సునీత దంపతులు ఉపాధ్యాయులు పోసాని శారద మాధవి గ్రామ పొదుపు సంఘాల ప్రతినిధులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు