13 July, 2026 | 11:55 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

న్యాయవాద కుటుంబాలకు బీమా

05-10-2025 12:18 AM
  1. ఇన్సూరెన్స్ అందించేందుకు కేంద్రం ఆమోదం

బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల రామారావు

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి):  దేశంలోని  దాదాపు 30 లక్షల మంది న్యాయవాదులు,  వారి కుటుంబ సభ్యులకు బీమా (ఇన్సూరెన్స్) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల రామారావు తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, దాడులు, ఇతర భద్రతా సమస్యల పరిష్కారంగా ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం తీసు కురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. లా కమిషన్ రిపోర్ట్ అందగానే కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఆరోగ్య భద్రత, బీమా, డెత్ బెనిఫిట్‌లతో కూడిన ఇన్సూరెన్స్ స్కీంను రూపొందించి అమలు చేయనుందని తెలిపారు. 

ప్రస్తుతం 50 వేల మంది న్యాయవాదుల్లో కేవలం సగం మందికి మాత్రమే స్టేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ అందుతోందని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం మరో రూ. 100 కోట్లు విడుదల చేసి న్యాయవాదులకు సమానంగా ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు.