21 May, 2026 | 3:17 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

ఇల్లెందు ఏరియాలో కారుణ్య నియామకాల కోసం ముఖాముఖి

08-09-2025 12:00 AM

ఇల్లెందు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జి.యం వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసులకు జి. యం కార్యాలయంలో ఆదివారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ సందర్భముగా డి.జి.యం.(పర్సనల్) అజ్మీర తుకారాం, జే.కె.ఒసి ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ..

ఇల్లందు ఏరియా జే.కే.5 ఉపరితల గని నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేశారు. ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత అందరిని వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.