17 April, 2026 | 2:05 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

హరిరాం కేసులో దర్యాప్తు ముమ్మరం

04-05-2025 12:40 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు మమ్మరం చేసింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి హరిరాంను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుని, సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ప్రశ్నించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం హరిరాం ఆస్తులు రూ.13 కోట్లుగా గుర్తించగా.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ పదిరెట్లని అంచనా. ఈ లెక్కన వంద కోట్లకు పైగా హరిరాం ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హరిరాంకు చెందిన లాకర్లను తెరిస్తే ఆస్తుల విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్టు సమాచారం.