1 July, 2026 | 11:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

హరిరాం కేసులో దర్యాప్తు ముమ్మరం

04-05-2025 12:40 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు మమ్మరం చేసింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి హరిరాంను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుని, సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ప్రశ్నించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం హరిరాం ఆస్తులు రూ.13 కోట్లుగా గుర్తించగా.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ పదిరెట్లని అంచనా. ఈ లెక్కన వంద కోట్లకు పైగా హరిరాం ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హరిరాంకు చెందిన లాకర్లను తెరిస్తే ఆస్తుల విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్టు సమాచారం.