9 April, 2026 | 10:24 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పేలుడుపై దర్యాప్తు భేష్

14-11-2025 12:16 AM

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

వాషింగ్టన్, నవంబర్13: దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్య లు చేశారు. ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడే అని తెలిపారు. అత్యంత పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోయి చాలా మంది మరణించారు అని ఆయన అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించడంలో భారత్‌కు ఎవరి సాయం అవసరం లేదు.. అధికారుల పనితీరు ప్రశంసనీయం అని కొనియాడారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం కెనడాలో జరిగిన జీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మార్కో రుబియో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో భారత దేశం వ్యవహరించిన తీరును మార్కో  ప్రశంసించారు. పేలుళ్ల దర్యాప్తులో భారతదేశానికి సహాయం చేయడానికి అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే భారత అధికారులు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, వారికి మా సహాయం అవసరంలేదని మార్కో స్పష్టం చేశారు.