9 April, 2026 | 8:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీహార్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

14-11-2025 12:18 AM

పాట్నా, నవంబర్ 13 : అందరి దృష్టి బీహార్‌పైనే ఉంది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చివరిపర్వం కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నా రు. ఎగ్జిట్ ఫలితాలు నిజమౌతాయా.. బీహార్ ఓటరు తీర్పు మరోలా ఉంటుందా తేలనుంది.

రాష్ట్రంలో రెండవ దశ పోలింగ్ 66.91 శాతంగా రికార్డు స్థాయిలో నమోదైంది. 1951 నుంచి రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ఓటింగ్ శాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. రెండవ దశలోని 66.91 శాతం ఓటింగ్‌లో మహిళా ఓటర్లు 17.6 శాతం ఉన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మరోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండగా, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ నాయకత్వంలో గెలుపు ఖాయమని మహాఘట్బంధన్ భావిస్తున్నది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.