11 April, 2026 | 11:56 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

పురాతన ఆలయాలను రక్షించుకోవడం మన ధర్మం

02-11-2025 10:40 PM

బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి

తాడ్వాయి (విజయక్రాంతి): పురాతన ఆలయాలను రక్షించుకోవడం హిందువుగా మన ధర్మమని బిజెపి రాష్ట్ర నాయకులు, ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర ఆలయం శాశ్వత మండపాన్ని రెండు లక్షల 50 వేలతో నిర్మించారు. ఆ మండపాన్ని పైడి ఎల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాలను కాపాడడం హిందువుగా పుట్టిన మన బాధ్యత అని అన్నారు. పునర్నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, సంతాయి పేట్ గ్రామాల ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.