14 April, 2026 | 5:12 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

హన్మకొండలో జాదూగర్ సికిందర్ ప్రదర్శనలు

10-12-2025 06:50 PM

హనుమకొండ (విజయక్రాంతి): ప్రముఖ మెజీషియన్ జాదూగర్ సికిందర్ ప్రదర్శనలు గురువారం నుండి అంబేద్కర్ భవన్ లో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ మెజీషియన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాన్పూర్ నుండి విచ్చేసిన మెజీషియన్ సికందర్  అంతర్జాతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలు హన్మకొండ అంబేద్కర్ భవన్ లో డిసెంబర్ 11 నుంచి 28 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిల్లీ, హైదరాబాద్, ముంబాయి లాంటి ప్రముఖ నగరాలలో వివిధ వేదికలపై పదివేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చిన ప్రఖ్యాత మెజీషియన్ సికందర్ హన్మకొండలో తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి వస్తున్నారన్నారు. ఈ ప్రదర్శనలో కొత్తదనం, వైవిధ్యం రెండూ ఉంటాయనీ, ప్రతి మెజిషియన్ కు వారి స్వంత ప్రత్యేక శైలి ఉంటుందనీ, సికందర్ బృందం డైనోసార్ భ్రమ, బెర్ముడా ట్రయాంగిల్ ప్రభావం, అనేక ఇతర ఉత్కంఠభరితమైన  ఇంద్రజాల విన్యాసాలను ప్రదర్శిస్తుంది అన్నారు.కొత్త షో, కొత్త స్టైల్, కొత్త అనుభవంతో ప్రతిరోజూ రెండు షోలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మెజీషియన్ కళ్యాణ్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.