24-05-2025 01:47:13 AM
-తెలంగాణ తల్లి చిత్రం కూడా ముద్రణ
-జూన్ 12నుంచి విద్యార్థులకు పంపిణీ
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, తెలంగాణ తల్లి చిత్రాన్ని ముద్రించారు. 2025 విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల్లో ఈ చేర్పులు చేయాలని గతేడాదే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో వీటిని ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలకు ఇందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు నోటు పుస్తకాలు చేరుకున్నాయి.