15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయండి

13-05-2025 12:02 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 12 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలోని అగ్రి గోల్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ సంస్థ బాధితులకు -న్యాయం చే యాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు య ర్రా బాబు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ అగ్రి గోల్ బాధితుల సంఘం ఆ ధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా యర్రా బాబు మా ట్లాడుతూ అగ్రి గోల్ కంపెనీ 1996లో ప్రా రంభించబడిందని కంపెనీలో డిపాజిట్లు చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయని -నమ్మిం చి డిపాజిట్ల సేకరణ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు రూ.5వేల కోట్లు వసూలు చేశారని ఆ డబ్బుతో స్థలాలు, భూములు కొనుగోలు చేయడంతో పాటు రిసారట్స్ నిర్మించారని బాబు తెలిపారు. 

వినతి పత్రం సమర్పించిన వారిలో బాధితుల సంఘం రాష్ట్ర కార్య దర్శి గోగుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, బాధితులు రాయల -నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వర్లు, మైలవర పు లక్ష్మి, ఎన్. హైమావతి, జి. అరుణ, బాగం వెంకయ్య, ప్రకాష్, పిఎస్‌ఎన్ రాజు, -ఎస్ కె సోందు, రమణారావు పాల్గొన్నారు.