26-12-2025 01:33:29 AM
ఈ క్షిపణి టార్గెట్ దాదాపు 3,500 కిలోమీటర్లు
భారత్ అణ్వస్త్ర నిరోధక శక్తి బలోపేతం
వైజాగ్, డిసెంబర్ 25(విజయక్రాంతి): అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి 3,500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడిన కే4 క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షిం చింది. ఈ సక్సెస్ భారత నావికా దళాల సముద్ర ఆధారిత అణుదాడి సామర్థ్యానికి భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భారతదేశం అణ్వస్త్ర నిరోధక శక్తి మరింత బలో పేతమైంది. భారతదేశం తన అణు సామర్థ్యాలలో గొప్పగా చెప్పాలంటే, అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామి నుంచి ప్రయోగించబడిన ఇంటర్మీడియట్- రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది.
కే-4 క్షిపణిని మూడు రోజుల క్రితమే బంగాళాఖాతంలోని అణుశక్తితో నడి చే జలాంతర్గామి ఐఎవఎస్ అరిఘాట్ నుం చి పరీక్షించారు. ఈ పరీక్ష విశాఖపట్నం తీ రంలో జరిగింది. అయితే ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రటన విడుదల చేయలేదు. కే4 జలాంతర్గామితో ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ ఎల్బీఎం) ఆగస్టు 29, 2024న భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టబడింది.
దీనితో భారతదేశం భూమి, గాలి, సముద్రం నుంచి అణు క్షిపణిని ప్రయోగించగల సామర్థ్యం ఉన్న చిన్నదేశాల సమూహంలో భాగమైం ది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పటికే 5,000 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగిన ఎస్ఎల్బీఎంలను మోహరించాయి. భారతదేశం కే-4 కార్యక్రమం ప్రపంచ వ్యూ హాత్మక సామర్థ్యాలను సరిపోల్చడంలో కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది. కే- సిరీస్ క్షిపణులలో ‘కే’ అనేది భారతదేశ ఇం టిగ్రేటెడ్ గైడెడ్ మిస్త్స్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఐజీఎండీపీ)లో కీలక పాత్ర పో షించిన అబ్దుల్ కలాంకు నివాళికి గుర్తు.